Header Banner

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

  Sun May 11, 2025 07:21        Others

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం తోటవలస గ్రామానికి చెందిన సంతోషి భర్త గత మూడు నెలల క్రితం అకస్మాత్తుగా చనిపోయాడు. భర్త మృతితో మనస్తాపం చెందిన సంతోషి గత కొద్ది రోజులుగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలోనే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని అక్కడ నుంచే చికిత్స పొందుతుంది. అందులో భాగంగా సంతోషి ఎప్పటిలాగే తన గ్రామం నుండి బయలుదేరి విశాఖ చేరుకుంది. అక్కడ చికిత్స పొందిన తరువాత తిరిగి ఇంటికి వచ్చేందుకు రైల్వేస్టేషన్ కి చేరుకుంది. అక్కడ టిక్కెట్ తీసుకుని విశాఖ నుండి పార్వతీపురం వెళ్ళేందుకు ట్రైన్ ఎక్కింది. అయితే ఆమె రాయగడ ఎక్స్ ప్రెస్ ఎక్కి తన గ్రామానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ లో దిగాలి. అయితే సంతోషికి అవగాహన లేకపోవడంతో రాయగడ ఎక్స్ ప్రెస్ ఎక్కబోయి ప్రక్కనే ఉన్న వేరొక ట్రైన్ ఎక్కి కూర్చుంది. కొంతసేపటి తర్వాత విజయనగరం రావాల్సిన ట్రైన్ తునిలో ఆగింది. దీంతో తాను పొరపాటున వేరే ట్రైన్ ఎక్కానని గమనించి వెంటనే తునిలో ట్రైన్ దిగింది. వెంటనే సంతోషి తన తల్లికి ఫోన్ చేసి అమ్మా పొరపాటున బొబ్బిలి రావలసిన రాయగడ ఎక్స్ ప్రెస్ ఎక్కబోయి వేరే ట్రైన్ ఎక్కాను, ప్రస్తుతానికి తుని స్టేషన్ లో దిగాను. తిరిగి రాత్రికి ఏ సమయం అయినా ఇంటికి వస్తాను, తాను ఇంటికి వచ్చేవరకు కొడుకు జాగ్రత్త అని చెప్పింది. సరే అమ్మ జాగ్రత్తగా ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసింది సంతోషి తల్లి.

అలా తల్లితో మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే సంతోషి ట్రైన్ ట్రాక్ దాటుతుండగా ట్రాక్ పై వస్తున్న మరొక రైలు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోషి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే సంతోషి పరిస్థితి గమనించిన రైల్వే సిబ్బంది సంతోషి తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సంతోషి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. భర్త చనిపోయిన మూడు నెలలకి సంతోషి కూడా ట్రైన్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోవడంతో వారి తొమ్మిదేళ్ల ఏళ్ల కుమారుడు ఒంటరి వాడయ్యాడు. తన కుమార్తె మరణవార్త విని సంతోషి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది.

ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TrainTragedy #WrongTrain #AccidentalDeath #HeartbreakingStory #AndhraPradeshNews #RailwayAccident #EmotionalNews